హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థుల గెలుపుకోసం జాతీయ నాయకుల పర్యటనలు ఖరారు అయ్యాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్సరార్, పొలిట్బ్యూరో సభ్యులు బృందాకారత్, సుభాషిణిఅలీ, విజయరాఘవన్,బీవీ రాఘవులు పర్యటనలు ఖరారయ్యాయి. సీతారాం ఏచూరి 25వ తేదీన పాలేరు, 26న మిర్యాలగూడ, 27న భువనగిరి నియోజకవర్గాల్లో వివిధ బహిరంగసభలు, రోడ్షోల్లో పాల్గొంటారు. మాణిక్సరార్ 24న ఖమ్మం, ముదిగొం డ, 25న వాజేడు, భద్రాచలం, 26న కూసుమంచి సభలు, రోడ్షోల్లో పాల్గొంటారు. బృందాకారత్ 25న వైరా నియోజకవర్గంలో రోడ్షో, బోనకల్ సభ, 26న ఇబ్రహీంపట్నం, 27న దుమ్ముగూడెం, చర్ల, 28న కోదాడ, హుజూర్నగర్లలో రోడ్షోల్లో పాల్గొంటారు. సుభాషిణి అలీ 24న జనగామ, ముషీరాబాద్, విజయరాఘవన్ 20న వెంకటాపురం సభలో పాల్గొంటారు. బీవీ రాఘవులు ఈ నెల 19న పటాన్చెరు నియోజకవర్గం సభలో పాల్గొంటారు.