సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం టీఆర్ఎస్కు తమ సహకారం ఉంటుందని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ విమర్శలను స్వాగతిస్తూ అభినందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మగ్ధూంభవన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే బీజేపీ అనుకూల రాష్ర్టాలకు ఒక పద్ధతి, మిగిలిన రాష్ర్టాలకు మరో పద్ధతిలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తెలుగు రాష్ర్టాలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని మార్చి, ఒక ఫాసిస్ట్ ట్రెండ్ సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదన్నారు. ఎన్నికల విధానాన్ని సమూలంగా మార్చి దామా షా పద్ధతిలో జరగాలనే డిమాండ్తో ఉద్యమానికి కేసీఆర్ ముందుకు వస్తే, అందరం కలిసి పోరాడుతామని స్పష్టంచేశారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల ఘటనలో విచారణ చేపట్టి, దోషులను శిక్షించాలని డిమాండ్చేశారు.