నాంపల్లి, అక్టోబర్ 28: వేల కోట్ల కాంట్రాక్టులకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నాంపల్లిలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వారి ని కఠినంగా శిక్షించాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న మోదీని గద్దె దించే వరకు సీపీఐ పోరాటం సాగిస్తుందని స్పష్టంచేశారు.