హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ఎటూ తేలక సందిగ్ధంలో ఉన్న 20 గ్రామాల్లో పర్యటించారని, ఈ సందర్భంగా ఆయన అకడున్న ఆంధ్ర వారిని గోబ్యాక్ ఆంధ్ర.. అని హెచ్చరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉండి ధర్మేంద్ర ప్రధాన్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో నష్టం జరిగే అవకాశం ఉన్నందున తక్షణమే ప్రధాన్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆ 20 గ్రామాల సమస్యను వెంటనే పరిషరించాలని నారాయణ కోరారు.