హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా దర్బార్ ఎందు కోసం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.
ఎవరైనా వినతిపత్రం ఇస్తే స్వీకరించి, ప్రభుత్వానికి పంపొచ్చు. అంతే కానీ రాజ్భవన్ను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాత్ర అగ్గి రాజేస్తున్నదని పేర్కొన్నారు. గవర్నర్ పాత్ర రాజకీయంగా ఉండటం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందన్నారు. గవర్నర్ తలపెట్టిన దర్బార్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సీపీఐ నారాయణ తెలిపారు.