హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు తీసుకున్న విధంగా చర్యలు చేపట్టే దైర్యం ప్రధానమంత్రి మోదీకి ఉన్నదా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ నిలదీశారు.
గ్లోబల్ టైమ్స్లో వచ్చిన కథనాన్ని ఆదివారం ఆయన ప్రస్తావించారు. చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు 67.3 లక్షల మంది బ్యాంకు రుణాల ఎగవేతదారులను బ్లాక్ లిస్ట్ చేయమని ఆదేశించింది. విమానాల్లో ప్రయాణాలు చేయలేని విధంగా, కొత్తగా రూపాయి రుణం పుట్టకుండా, చివరకు క్రెడిట్కార్డులు కూడా పనిచేయకుండా చేసిందని చెప్పారు. దీంతో పది లక్షల మంది బెదిరిపోయి రుణాలు చెల్లించటానికి సిద్దపడుతున్నారని, మోదీసాబ్ మీరు అలాంటి చర్యలు తీసుకోగలరా? అని నారాయణ ప్రశ్నించారు.