భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెంలో సీపీఐకి చెందిన కౌన్సిలర్లు ఆ ఆర్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుపై తిరుగుబాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ నాయకుడి ఇంట్లో గురువారం రహస్య సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం సీటును ఎట్టిపరిస్థితుల్లోనూ కూనంనేనికి ఇవ్వకూడదని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్పాషాకు ఇవ్వాలని తీర్మానం చేశారు. తమను కాదని కూనంనేనికి సీటు ఇస్తే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు. అసమ్మతి బృందంలో ఎనిమిది మంది కౌన్సిలర్లు, పలువురు సీపీఐ నాయకులు ఉన్నారు.