అంకెల గారడీ బడ్జెట్తో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత బడ్జెట్కు అదనంగా మరో రూ.20వేల కోట్లు చేర్చి రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ భారీ అంకెలతో కూడుకున్నప్పటికీ, వాస్తవంగా రైతాంగం, కార్మికవర్గం, యువత, విద్యార్థులు, మహిళలకు చేసిన కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని తెలిపారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించామని చెబుతున్నప్పటికీ, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్తో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి రావడం కష్టమని తెలిపారు.