సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 23: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, యాదగిరిరావు, సీపీఐ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు సత్యం, శ్రీరాములుగౌడ్తో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సమావేశమయ్యారు. సంస్థాన్ నారాయణపురంలో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు అనుసరించాల్సి ప్రచార వ్యూహాలపై వీరు చర్చించారు.
అనంతరం సీసీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలతో కలిసి వినోద్కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పుట్టపాక గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. కార్యక్రమాల్లో భూదాన్ యజ్ఞ బోర్డు రాష్ట్ర చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డితో కలిసి కూనంనేని మాట్లాడుతూ.. బీజేపీ అనుసరిస్తున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కరోనా, క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనవన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పశువుల లాంటివారని మండిపడ్డారు.