హైదరాబాద్ : తెలంగాణలో ఎస్టీలకు 10శాతం శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో33ను జారీ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎస్టీల జనాభా పెంపు జీవో తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్టీలకు గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించారని, అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పొడు భూముల విషయంలో కూడా కోర్టు నుంచి ఇబ్బందులను అధిగమిస్తూ త్వరితగతిన హక్కు పత్రాలు ఇవ్వాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.