హనుమకొండ చౌరస్తా, జూలై 8 : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న సీపీగెట్-2026 ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) ప్రవేశ పరీక్షలు సాఫీగా ప్రారంభమైనట్టు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్, సీపీగెట్-2026 చైర్మన్ ఆచార్య కే ప్రతాప్రెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
మొదటి రోజు (జూలై 8) నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాల సెట్ను వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సీపీగెట్-2026 కార్యాలయం నుంచి ఉదయం ఎంపిక చేశారు. రోజూ పరీక్షలు మూడు విడుతల్లో నిర్వహించనున్నామని, ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.