CPGET – 2022 | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ ఈ ఫలితాలను విడుదల చేశారు.
పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 67,117 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 57,262 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 54,050 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. ఫలితాల కోసం www.osmania.ac.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.