హైదరాబాద్ : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళతో..అనుచితంగా ప్రర్తించిన మియాపూర్( Miyapur) సీఐపై వేటు పడింది. సీఐ ప్రేమ్ కుమార్(CI Prem Kumar)ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్(Suspend) చేశారు. వివరాల్లోకి వెళ్తే..నాలుగు నెలల క్రితం భార్య, భర్తల 498 కేసు విషయంలో మియపూర్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ని కలిశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే సీఐ దురుసుగా ప్రవర్తించాడని సదరు మహిళ సీపీకి ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదుతో సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమె పట్ల సీఐ అమర్యాదగా ప్రవర్తించాడని తేలండతో సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల పట్ల స్నేహపూర్వకంగా మెలగకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.