హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా అదుపులోనే ఉందని సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం చార్మినార్ ప్రాంతంలో పర్యటించిన అంజనీ కుమార్.. లాక్డౌన్ అమలును పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలతో పోల్చుకుంటే కరోనా కట్టడిలో హైదరాబాద్ బెటర్ అని అన్నారు. హైదరాబాద్లో కేసుల తీవ్రత తక్కువగా ఉందని, మరణాల రేటు కూడా అత్యల్పంగా ఉందని సీపీ స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్కు నగర ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చామని, అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.