హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA ) ఆధ్వర్యంలో కరోనా ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ వ్యాక్సినేషన్ క్యాంపును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. క్లబ్ ప్రతినిధులు, ఆటగాళ్లు, కోచ్లు, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ క్యాంపు రెండు రోజుల పాటు కొనసాగనుంది.
Inaugurated special vaccination drive for the cricketers & support staff of HCA at The Rajiv Gandhi International Cricket Stadium in Uppal. pic.twitter.com/3lDC15unVE
— V Srinivas Goud (@VSrinivasGoud) June 28, 2021