హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 2484 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్తో ఒకరు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి తాజాగా 4207 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,723 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 65,263 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1045 కరోనా కేసులు నమోదయ్యాయి.