నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ డీఏవో ప్రశ్నప్రతం కొనుగోలు కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సుష్మితను (ఏ18) శుక్రవారం చంచల్గూడ జైలు పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 28 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆమె భర్త సాయిలౌకిక్ (ఏ17)కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిమాండ్ తేదీని పొడిగించారు. కాగా, సాయిలౌకిక్, సుస్మిత దంపతుల బెయిల్ పిటిషన్లో వాదనలు ముగిశాయి. తిరుపతయ్య (ఏ15) గుండెజబ్బుతో బాధపడుతున్నాడని, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని అతడి తరఫున న్యాయవాది కోరారు. ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ (ఏ1) బెయిల్ పిటిషన్కు సిట్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. వాదనల కోసం సోమవారానికి వాయిదా వేశారు.