మెదక్: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ (Narsapur) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Raod accident) జరిగింది. మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. మృతులను చిలిపిచేడ్ మండలం రహీంగూడకు చెందిన నునావత్ రవీందర్, నీలగా గుర్తించారు.
రవీందర్.. శివంపేట్ మండలంలోని పిలుట్ల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని చెప్పారు. స్వగ్రామం నుంచి నర్సాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. వారికి కుమారుడు, కూతురు ఉన్నారని వెల్లడించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.