శక్కర్నగర్, ఆగస్టు 6: బాలికతో మాట కలిపిన ఓ కౌన్సిలర్ నమ్మించి వంచించాడు. ఇం టికి తీసుకెళ్తానని చెప్పి కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దర్జాగా వైన్స్ వద్ద మద్యం సేవిస్తుండగా, ఏడుస్తున్న బాలికను గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బోధన్లోని మూడో వార్డు (శక్కర్నగర్) కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ నిజామాబాద్ వెళ్లాడు. అక్కడ ఆటోలో వెళ్తు న్న తన ప్రాంతానికి చెందిన, పరిచయమున్న పదహారేండ్ల బాలిక కనిపించింది. ఆటో వద్దకు వెళ్లి ఆమెతో మాట కలిపాడు. తాను బోధన్కే వెళ్తున్నానని చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు.
మార్గమధ్యంలో ఎడపల్లి వద్ద దారి మళ్లించి మంగళ్పాడ్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఎడపల్లికి వచ్చి వైన్స్లో మద్యం తీసుకుని తాగుతుండగా, కారులో ఉన్న బాలిక కేకలు వేసింది. గమనించిన స్థానికులు అనుమానం వచ్చి కౌన్సిలర్ను పట్టుకు ని ప్రశ్నించగా, పొం తన లేని సమాధానం చెప్పాడు. బాలికను ప్రశ్నించగా జరిగింది చెప్పడంతో అతడిని చితకబాది ఎడపల్లి పోలీసులకు అప్పగించారు. సదరు కౌన్సిలర్ను బోధన్ సీఐ కార్యాలయానికి తరలించగా, బాధితురాలి తరపు వారు పెద్దసంఖ్యలో వచ్చి ఆందోళనకు దిగారు. నిం దితుడిని తప్పించే ప్రయత్నంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కౌన్సిలర్పై కిడ్నాప్తోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అఘాయిత్యానికి పాల్పడిన ప్రాంతాన్ని ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ నరేశ్, ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ మంగళవారం పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపి, నిందితుడిని రిమాండ్కు తరలించారు. కాగా కౌన్సిలర్ రాధాకృష్ణ సోదరుడు రవీందర్ సైతం గతంలో ఇలాగే ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడాదిన్నర క్రితం మూడో వార్డుకు చెందిన ఓ మైనర్పై దారుణానికి ఒడిగట్టిన కేసులో రవీందర్తోపాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళ్లొచ్చారు.