హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): శాసనసభ, శాసనమండలి ఒకేచోట ఉంటే అందరికీ ప్రయోజనకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. బుధవారం తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో ఆర్అండ్బీ అధికారులతో గుత్తా, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. పార్లమెంట్ మాదిరిగానే అసెంబ్లీ, శాసనమండలి రెండు కూడా ఒకేచోట ఉండాలని ప్రభుత్వం యోచించడం శుభపరిణామమని చెప్పారు. రెండు సమావేశ మందిరాలు ఒకేచోట ఉంటే శాసనమండలి, శాసనసభ సభ్యులకు, మంత్రులకు, అధికారులకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు మండలిని పాత అసెంబ్లీ హాలులోకి మార్చాలని సూచించారు. ఆర్అండ్బీతోపాటు అన్ని శాఖల అధికారులు మండలి మార్పు పనులను వేగవంతంగా చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. సమావేశంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అధికారులు పాల్గొన్నారు.