హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : పత్తిసాగు విస్తీర్ణం, ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో 2026 వానకాలం నుంచి రాష్ట్రం లోని 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం ‘పత్తి ఉత్పాదకత మిషన్’ను అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ బీ గోపి తెలిపారు. ఈ పథకం అమల్లో భాగంగా గురువారం సచివాలయం నుంచి రైతులకు విత్తన పంపిణీని ప్రారంభించినట్టు తెలిపారు.
కాటన్ మిషన్ పథకం 2026 వానకాలం నుంచి 2030-31 వరకు అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్హన్ పత్తిలో హెచ్డీపీఎస్, సీఎస్, ఐసీఎం సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, వ్య వసాయ శాఖ ఉప సంచాలకులు బీ నరసింహారావు సంయుక్త సంచాలకులు బాలు పాల్గొన్నారు.