యాదాద్రి;యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు వైటీడీఏ దివ్య సన్నిధి కాటేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొండకు ఈశాన్య ప్రాంతంలో గుట్టపై నిర్మించిన ప్రెసిడెన్సియల్ సూట్ను వైటీడీఏ దివ్య సన్నిధి కాటేజీ పేరుతో భక్తులకు అద్దెకు ఇవ్వనున్నట్టు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు శుక్రవారం తెలిపారు. దివ్య సన్నిధి పేరుతో 15 డోనర్ కాటేజీలను నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. https://booking. ytda.in/ వెబ్సైట్లో కాటేజీలను బుక్ చేసుకొనే వీలుందన్నారు. ఒక్కో కాటేజీకి రోజుకు రూ.3 వేలు అద్దె ఉంటుందని ఆయన పేర్కొన్నారు.