హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసేందుకు, ప్రజలను కరోనా బారి నుంచి రక్షించేందుకు రాబో యే రోజుల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేసేలా ఏర్పా ట్లు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా సెంకడ్వేవ్ ముగిసిపోయిందని, ప్రజలు అలస త్వం వహించవద్దని, కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. అప్పుడే థర్డ్వేవ్ రాకుండా నివారించగలుగుతామని చెప్పా రు. ఒకవేళ మూడోవేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నట్టు వెల్లడించారు. బుధవారం కోఠిలోని ఆరోగ్యశాఖ కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని, కాబట్టి అన్ని జ్వరాలను కరోనాగా అనుమానించొద్దని సూచించారు. జ్వర లక్షణాలు ఉన్నవారు, కరోనా లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల కొవిడ్ టీకాలు వేశామని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యంలో 56 శాతం మందికి తొలి డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని వివరించారు. జీహెచ్ఎంసీలో 90 శాతం మందికి కనీసం తొలిడోస్ వేశామని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 100 శాతం మందికి కనీసం ఒక్కడోస్ వేశామని ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,200 డెంగీ కేసులు నమోదయ్యాయని, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా వచ్చాయని, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎకువగా వచ్చాయని వివరించారు. సీజనల్ వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెస్టులకోసం 20 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు పనిచేస్తున్నాయని అన్నారు. డెంగీ చికిత్సకు ప్రత్యేకంగా 24 ప్లేట్ లెట్ ఎలక్ట్రిక్ యంత్రాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.