హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం కొత్తగా 2,098 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 629, రంగారెడ్డిలో 117, ఖమ్మంలో 101, మేడ్చల్ మల్కాజిగిరిలో 98 కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు 3 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గింది. కరోనా, ఇతర వ్యాధులతో ఇద్దరు మరణించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1.71 లక్షల మందికి టీకాలు వేశారు. 29 వేల మందికి మొదటి డోస్, 1.33 లక్షల మందికి రెండో డోస్, 8,688 మందికి బూస్టర్ డోస్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9.63 లక్షల డోసులు, ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో 53,434 పడకలు అందుబాటులో ఉన్నాయి.