కాల్వశ్రీరాంపూర్, మే 18: కరోనా వేళ ఆశ కార్యకర్తల సేవలను గుర్తించి.. నెల పింఛన్ విరాళంగా అందించి ఔదార్యం చాటుకున్నాడు ఓ దివ్యాంగుడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రానికి చెందిన దివ్యాంగుడు మంథని రామస్వామి తన నెల పింఛన్ రూ.3 వేలను గ్రామానికి చెందిన ముగ్గురు ఆశ కార్యకర్తలకు మంగళవారం అందజేశాడు.