హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్యే
హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.
మూడు రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే దానం సూచించారు. అలాగే ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.