నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఏకంగా మూడు బ్యాంకులపై కరోనా ప్రభావం పడింది. ఒకేసారి మూడు బ్యాంకులకు సంబంధించిన 10 మంది సిబ్బంది కరోనా బారిన పడడంతో అధికారులు ఆయా బ్యాంకు సేవలను నిలిపివేశారు.
పట్టణంలోని డీసీసీబీ బ్రంచిలో ముగ్గురు, ఎస్బీహెచ్ బ్రాంచిలో ఐదుగురు, ఎస్బీఐ బ్రాంచీలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ఆయా బ్రాంచి కార్యాలయాలను శానిటైజ్ చేసే నిమిత్తం శనివారం మూసి ఉంచారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి ఒకరికి కరోనా సోకడంతో ఒకరోజు బ్రాంచి కార్యాలయాన్ని మూసి ఉంచిన విషయం తెలిసిందే. బ్యాంకు సిబ్బంది కరోనా బారిన పడి బ్యాంకులు మూత పడిన విషయం తెలియని వినియోగదారులు బ్యాంకుకు వచ్చి వెనుదిరిగారు.