హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం కొత్త ఒమిక్రాన్ కేసులు ఏవీ నమోదు కాలేదు. మరోవైపు 177 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది. 190 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. మరో 3,596 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 98.88 శాతంగా నమోదైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 93, రంగారెడ్డిలో 16 కేసులు వెలుగు చూశాయి.