జగిత్యాల : జిల్లాలోని మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపింది. బుధవారం ఉదయం ఒంట్లో నీరసం, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో పోలీస్ సిబ్బందిలో పలువురు స్థానిక ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు.
వీరిలో ఏఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అందులో ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వెంటనే వారు హోం ఐసోలేషన్ కు వెళ్లారు.