హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్లో ఉన్నారు. దీంతో తనను కలిసినవాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. వెంకయ్యనాయుడికి కరోనా సోకటం ఇది రెండోసారి. కాగా, వైద్యుల సూచనల మేరకు వారం పాటు ఉపరాష్ట్రపతి స్వీయ నిర్బంధంలో ఉంటారని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. దీనిపై ఎంపీ సంతోష్కుమార్ స్పందిస్తూ.. ‘ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనాబారిన పడటం విచారకరం. సర్.. మీరు త్వరగా కోలుకోవాలి’అని ట్వీట్ చేశారు.