వంట గ్యాస్ లీక్ అవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వంట గ్యాస్ లీక్ అవడంతో భార్యాభర్తలు మండిగ నాగ రామకృష్ణ,శ్రీ లక్ష్మి,పిల్లలు సాహిత్య సజీవ దహనం అయ్యారు. మరో పాప సాహితి పరిస్థితి మరింత విషమం ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే నిజంగా ప్రమాదవశాత్తే ఈ ఘటన జరిగిందా? లేక ఏమైనా ఆర్ధిక ఇబ్బందులు వల్ల సుసైడ్ చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.