హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్కు త్వరలో కొత్త కన్వీనర్ రానున్నారు. ఇప్పటివరకు కన్వీనర్గా ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ విధులు నిర్వర్తించారు. ఇప్పుడాయనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా నియమించి పూర్తిస్థాయి బాధ్యతలప్పగించారు. ఉన్నత విద్యామండలి అధికారులు కొత్త కన్వీనర్ పేరును సూచించాల్సిందిగా ఓయూ వీసీ కి లేఖ రాశారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ పీ చంద్రశేఖర్ సహా మరో ఇద్దరి పేర్లను ఓయూ అధికారులు ప్రతిపాదించారు.