సుల్తాన్బజార్, నవంబర్ 28: ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం మరువలేనిదని దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ బీ నాగేందర్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద దవాఖాన అభివృద్ధికి సహకారం అందించేందుకు హెచ్ఏఎల్ సంస్థ సోమవారం ఎంవో యూ కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ జే సర్కాటే, డాక్టర్ బీ నాగేందర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం నాగేందర్ మాట్లాడుతూ దవాఖానలో పేద రోగులకు అత్యాధునిక వైద్యం అందించేందుకు హెచ్ఏఎల్ సంస్థ రెం డు దశల్లో వైద్య పరికరాలను అందజేస్తున్నదని పేర్కొన్నారు. తొలిదశలో రూ.5.5 కోట్ల తో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి యంత్రాలు అందజేస్తున్నట్టు వివరించారు. రెండో దశలో ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి రూ.1.5 కోట్లు, న్యూరో సర్జరీ విభాగానికి రూ.2.5 కోట్ల విలువైన వైద్య పరికరాలు అం దించేందుకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ జే సర్కాటే మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందేలా చూడటమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఏఎల్ ప్రతినిధులు ఏవీ మురళీకృష్ణ, సుమంత్ చంద్ర, సూర్యకాంత్ రౌత్, ఉస్మానియా దవాఖాన వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ త్రివేణి, డాక్టర్ రమేశ్, డాక్టర్ నాగప్రసాద్, డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.