హైదరాబాద్ : రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు మద్దతు లేఖను యూనియన్ నేతలు అందజేశారు. మంత్రిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తీర్మానం ప్రతిని అందజేశారు. అనంతరం కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారిని మంత్రి హరీశ్రావు అభినందించారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.