Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిన, 50 మంది టీఎస్కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద, 1,940 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల కాలపరిమితి 2024, మార్చి 31తో ముగియనుంది.
లెక్చరర్లు -527
టీఎస్కేసీ ఫుల్ టైమ్ మెంటర్లు – 50
గెస్ట్ ఫ్యాకల్టీ – 1,940
సీనియర్ అసిస్టెంట్ -29
డాటా ఎంట్రీ ఆపరేటర్ – 31
స్టోర్ కీపర్ – 40
జూనియర్ స్టెనో – 01
రికార్డు అసిస్టెంట్ – 38
మ్యూజియం కీపర్ -07
హెర్బేరియం కీపర్ -30
మెకానిక్ – 08
ఆఫీసు సబార్డినేట్ – 157.