మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 25,344 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దాదాపు అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు. 25,214 క్యూసెక్యుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా, ప్రస్తుతం 1040 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 6.768 టీఎంసీల నీటినిల్వ ఉన్నది.