నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10 : కృష్ణా బేసిన్కు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి స్థిరంగా ఇన్ఫ్లోలు వస్తుండటంతో పలు ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం 93 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో 14 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో గేట్లను కుదించారు. సాయంత్రం 6 గంటలకు 81,500 క్యూసెక్కులకు చేరింది. 6 గేట్ల ద్వారా 24,354 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,42,224 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్కు 79919 క్యూసెక్కుల ఇన్ఫ్లో , అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతున్నది. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. పులిచింతల 152.688 (13.466 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది.