హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండి బయట ఉన్న క్యూ లైన్లలో కూడా భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 20 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 70,668 మంది భక్తులు దర్శించుకొన్నారు. 38,036 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీకి రూ.3.64 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.