హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): కృ ష్ణా నదీ జలాల వినియోగంలో ఏపీ అడ్డగోలుగా వ్య వహరిస్తున్నదని, కేటాయింపులకు మించి నీటిని వా డుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వం ధ్వజమెత్తిం ది. దీనిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వెంటనే స్పందించాలని, ఏపీ అక్రమాలను నిలువరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ బుధవారం కేఆర్ఎంబీకి లేఖ రాశారు. 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీ 641.05 టీఎంసీలు, తెలంగాణ 330.23 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ ఫిబ్రవరి 28 నాటికే ఏపీ 673.60 టీఎంసీలను ఉపయోగించుకున్నదని వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని వినియోగించకుండా ఏపీని నిలువరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంటనే ఆ రాష్ర్టానికి తగు ఆదేశాలు జారీచేయాలని ఈఎన్సీ మురళీధర్ కోరారు.