హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్వై) పథకంలో భాగంగా మోడ్రనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ (ఎం-సీఏడీ, డబ్ల్యూఎం) సబ్స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ డిపార్ట్మెంట్, రాష్ట్ర, జిల్లాస్థాయిలో స్టీరింగ్ కమిటీలను నియమించింది. సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్రం సీఏడీ, డబ్ల్యూఎం స్కీమ్ను అమలు చేయాలని ఏప్రిల్లో నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర, జిల్లా కమిటీలు, నోడల్ డిపార్ట్మెంట్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను నియమించింది. స్కీమ్ అమలు కోసం ఇరిగేషన్శాఖను నోడల్ డిపార్ట్మెంట్గా, క్యాచ్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా సీఈలు, నోడల్ ఆఫీసర్గా ఎస్ఈని నియమించింది. స్కీమ్కు సంబంధించి ప్రణాళికల రూపకల్పన, ప్రాజెక్టుల ఎంపిక తదితర వాటికోసం స్టేట్లెవల్, జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీలను నియమించింది.