హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : పోలీస్ కానిస్టేబుళ్లకు ఎస్జీటీ పేస్కేల్ ఇవ్వాలని, ఎస్సైలకు గెజిటెడ్ హోదా కల్పించాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు పీఆర్సీ చైర్మన్కు, ఐజీ చంద్రశేఖర్రెడ్డికి మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి, పలు జిల్లాల అధ్యక్షులు వినతిపత్రం అందజేశారు.
సీనియర్ పోలీసులకు వెయిటేజీ ఇంక్రిమెంట్స్ ఇస్తూ.. రిస్క్ అలవెన్స్, పెట్రోల్ అలవెన్స్ పెంచాలని విజ్ఞప్తి చేశారు.