హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రవాణాశాఖ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యవర్గం ఎన్నికల అధికారిగా మేడ్చల్ ఆర్టీఏ డీ ప్రదీప్ రామకృష్ణ, రిటైర్డ్ ఏవో షేక్ ముంతాజ్ వ్యవహరించారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా జీ శ్రీనివాస్, అధ్యక్షుడిగా ఎస్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ ప్రతీశ్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా కే గోవింతరాజ్, కోశాధికారిగా బీ హనుమంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాఎం నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా సీహెచ్ శ్రీనివాస్, ఆర్ చంద్రశేఖర్, ఏ గౌతమి భవాని, జాయింట్ సెక్రటరీలుగా డీ నవీన్కుమార్, సీహెచ్ గంగాధర్, కే సింధూజ ఎన్నికయ్యారు.