సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్(Constable suicide) అర్రూరి సైదులు(41) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెన్ పహాడ్ మండలంలోని తన స్వగ్రామమైన ధర్మపురంలో గల తన వ్యవసాయ క్షేత్రం వద్ద బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల వల్ల భార్యభర్తలు ఇరువురు గొడవ పడేవారని స్థానికలు తెలిపారు.
కాగా, ఆమె కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లడంతో సైదులు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. 2004 బ్యాచ్ కి చెందిన సైదులు ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే అద్దె ఇంట్లో ఉంటూ అదనపు ఎస్పి నాగేశ్వరావు వద్ద డ్రైవర్గా పని చేస్తున్నారు. కాగా, మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ఆయన మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.