కొత్తపల్లి, ఆగస్టు 17 : కరీంనగర్ ఎక్సైజ్ శాఖకు చెందిన కానిస్టేబుల్ లెంకల మహిపాల్రెడ్డి లడఖ్లోని మౌంట్ యునాన్ పర్వతాన్ని అధిరోహించి జాతీయజెండాను ఎగురవేశారు. ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్ యునామ్ (6,111) మీటర్ల పర్వతారోహణకు 15 మంది సభ్యుల బృందం వెళ్లగా, అందులో మహిపాల్రెడ్డి ఉన్నారు. ఈ బృందం సభ్యులు ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం అక్కడ జాతీయపతకాన్ని ఆవిష్కరించారు. ఇందుకుగాను గిన్నిస్ రికార్డుతోపాటు హైరేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించుకున్నట్టు మహిపాల్రెడ్డి తెలిపారు.