కొత్తపల్లి : కరీంనగర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖకు చెందిన కానిస్టేబుల్ లెంకల మహిపాల్రెడ్డి లఢఖ్లోని మౌంట్ యునాన్ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్ యునామ్ (6111) మీటర్ల పర్వతారోహణకు 15 మంది సభ్యుల బృందం వెళ్లగా, అందులో మహిపాల్రెడ్డి ఉన్నారు. ఈ బృందం సభ్యులు ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం అక్కడ జాతీయ పతకాన్ని పర్వతంపై అవిష్కరించారు. వీటికి గాను ఆయనకు గిన్నిస్ రికార్డుతో పాటు హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించుకున్నట్లు మహిపాల్రెడ్డి తెలిపారు.