కౌటాల, నవంబర్ 8 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్స్టేషన్లో మంగళవారం ఉదయం ఐదుగంటల ప్రాంతం లో తుపాకీ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సూర రజినీకుమార్ (29) మృతి చెందారు. సెంట్రీగా ఉన్న రజినీకుమార్ మరో 5 నిమిషాల్లో డ్యూటీ పూర్తవుతుందనగా ఈ ఘటన జరిగింది. ఎస్ఎల్ఆర్ తుపాకీ బుల్లెట్ దవడ కింది నుంచి నుదుటి పైభాగంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయమై రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను గమనించిన తోటి కానిస్టేబుల్ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే సీఐ బుద్ధే స్వామి, ఎస్సై ప్రవీణ్కుమార్.. రజినీకుమార్ను కాగజ్నగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఎస్పీ సురేశ్కుమార్, డీఎస్పీ కరుణాకర్.. రజినీకుమార్ను పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఉదయం 10.40 గంటలకు కానిస్టేబుల్ మృతి చెందారు.