చివ్వెంల, ఫిబ్రవరి 15 : వివాహమై పదేైండ్లెనా సంతానం కలుగడం లేదని కలత చెందిన కానిస్టేబుల్ ఈనెల 7న ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఎస్సై విష్ణు వివరాల ప్రకారం.. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్పల్లికి చెందిన దొడ్డి మధుబాబు (39) 2012లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. అదే సంవత్సరం వివాహమైంది. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు.
సంతానం కలుగలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 7న గడ్డిమందు తాగి ఇంటికి వెళ్లాడు. పురుగుల మందు తాగినట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే మధుబాబును సూర్యాపేటలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.