హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు ప్రియశిష్యుడు రేవంత్రెడ్డి రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కలపాలని కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ బుధవారం ప్రకటనలో ఆరోపించారు. కాళేశ్వరాన్ని నిరుపయోగంగా చేయడం ద్వారా ఇక్కడి ప్రజలు తిరిగి ఆంధ్రాపై ఆధారపడే పరిస్థితులు తీసుకురావాలన్న దూరదృష్టితోనే సీఎం రేవంత్ నడుచుకుంటున్నారని పేర్కొన్నారు.