హిమాయత్నగర్, ఆగస్టు 29: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసి, మూసివేసేందుకు నరేంద్రమోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ను కార్పొరేషన్గా మార్చి సమర్థంగా నడుపుతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వీఆర్ఎస్ పేరుతో 80 వేల మంది ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపిందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న మోదీ సర్కార్ బీఎస్ఎన్ఎల్కు అందజేయాల్సిన ఆర్థిక సహకారంపై నియంత్రణలు విధించడంతోపాటు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో తీవ్ర వివక్ష చూపిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకొనేందుకు మోదీ సర్కార్పై ఐక్యంగా పోరాడాలని ప్రజలకు బోస్ పిలుపునిచ్చారు.