(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ప్యాకేజ్డ్ గంగాజలంపై 18 శాతం జీఎస్టీ విధింపు నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) గురువారం ఎక్స్లో వివరణ ఇచ్చింది. గంగాజలం సహా అన్ని పూజా సామగ్రిలను జీఎస్టీ స్లాబ్ నుంచి మినహాయిస్తున్నట్టు పేర్కొన్న ప్రతిని ఈ మేరకు ఉదహరించింది.
ఆన్లైన్ మాధ్యమాల్లో కొనుగోలు చేసే గంగాజల్ బాటిల్స్ మీద జీఎస్టీ 18 % వసూలు చేస్తుండటం, ప్యాకేజ్డ్ గంగాజలం వాటర్ మీద కేంద్రం 18 శాతం జీఎస్టీ విధించినట్టు పలు మీడియాల్లో వార్తలు రావడంతో కేంద్రం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై విధంగా స్పందించింది.